Menu Close

మ్యూజిక్ ప్రియులకి మంచి ఇయర్ బడ్స్
తక్కువ బడ్జెట్ లో అమెజాన్ ఆఫర్ 👇

Buy Now

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

కలి పురుషుని కథాకమామీషుతెలుసుకోవడం మంచిది-Telugu Articles

కలియుగం అంటే ఏమిటి ?
కలి ఎవరు ?
కలి మనలో ఎలా ప్రవేశిస్తుంది?
కలి నుండి మనం ఎలా తప్పించు కోగలం ?
ముఖ్యమైన యుగాలు 4.

  • కృతయుగం
  • త్రేతాయుగo
  • ద్వాపరయుగం

కలియుగం
కలియుగం అంటే ఏమిటి?
ఇప్పుడు మనం ఉన్న యుగమే కలియుగం .
యుగాల సృష్టిలో 4వది ‘కలి’. ద్వాపర యుగం లో అన్నా చెల్లెళ్లకు పుట్టిన వాడే ఈ కలిపురుషుడు ఇతని కాలాన్నే కలియుగం అంటాము.
ఈ యుగం మిగతా యుగాలకంటే చాలా భిన్నం గా ఉంటుంది. ఈ యుగం అయిపోయాక సృష్టి అంతమై పోయి, తిరిగి యుగాలు ప్రారంభ మవుతాయి .
కలి ప్రభావం ?
కలియుగంలో కలి
పురుషుని ప్రభావం చాల దారుణంగా ఉంటుంది.
కలియుగంలో కలిపురుషుని ప్రభావం వల్ల దేవతలకు హవిస్సులందవు.
వేదము అవమానింప బడుతుంది.
పితృదేవతలకు శ్రాద్ధం పెట్టరు. ధర్మాత్ములు, భూమాత, గోమాతలు అవ మానింప బడతారు
అసత్యం, బంగారం, డబ్బు చాల ముఖ్యమనుకోవడం. కష్టపడిన వారికి ఫలితం తక్కువ.కష్టపడని వారికి ఫలితం ఎక్కువ.శాస్త్రీయత పేరుతో దైవభక్తి ఉండదు.మనుషులలో నీతి నిజాయితీలు ఉండదు.
దాన-ధర్మాలు ఉండవు.
తల్లిదండ్రులు, అత్తమామలు, అక్కాచెల్లెళ్లు, అనే అనుబంధాలు తగ్గి కలి వైపరీత్యం వల్ల యుగాంతంలో కరువులు, వరదలు, యుద్దాలు, ఆకలి చావులు వచ్చి, యుగం అంతమై పోతుంది.
కలి పురుషుడు వీరిలో ఎక్కువగా ప్రవేశిస్తాడు.

  • జూదం ఆడే వారిలోకి
  • మద్యం సేవించే వారి లోకి
  • వ్యభిచారం చేసే వారి లోకి
  • జీవహింస చేసే వారిలోకి
  • జూదంలో నుంచి అసత్యం లోకి,
  • మద్యం ద్వారా మదం, అహంకారాల లోకి
  • వ్యభిచారం నుంచి కామవాంఛకు,

హింస లోంచి కోపం లోకి ఎగ బాకుతాడు కలి.
కలి పురుషుడు ఈ యుగం లో కి ఎలా వచ్చాడు?

పరీక్షిత్తు మహారాజు – ఎద్దు (ధర్మ దేవత):
పరీక్షిత్ మహారాజు కలిని అంత మొందించ బోవడం:-
ధర్మ బద్ధంగా పరిపాలిస్తున్న పరీక్షిత్తు మహారాజుకు (చక్రవర్తి) దేశం లో ఒక రోజు ఒక గోమాత ఏడుపు వినిపించింది.
తనదేశంలో బాధతో ఉండేవారు అనేది ఉండదు . మహారాజు గారు ఆ గోమాత దగ్గరకి వెళ్ళాడు .ఆ గోమాత.. ఒక ఎద్దుకు మూడు కాళ్ళు విరిగిపోయి ఒక కాలే మిగిలి ఉన్న విషయము చెప్పింది ఆ ఆవు ఎద్దుని ఊరడిస్తూ ఉంది .(ఆ గోమాత మన భూమి ఎద్దు ధర్మ దేవత) ఏమైందని రాజు అడుగగా ఎద్దు కలి ఈ యుగం లోకి ప్రవేశించాడని, అతను తన కాళ్ళను నిర్దాక్షిణ్యంగా విరిచేడని చెప్పింది. అప్పుడు పరీక్షిత్ మహారాజు ఎద్దుతో, ఎవరికీ అవసరం లేని గడ్డి తిని, మనుషులు తాగలేని నీటిని తాగే నిన్ను ఎవరు హింసించారు.
ఎవరికీ అపకారం చేయని నీ కాళ్లు ఎవరు విరగ్గొట్టారు అని అంటాడు.
ఎద్దు కాలు విరగొట్టిన వారు ఎవరైనా సరే అతని భుజాలు విరగ్గొడతాను అంటాడు పరీక్షిత్ మహారాజు.
కామక్రోధావేశుడై, రాజులా కనిపించే కఠినాత్ముడు, కర్ర పట్టుకుని మేము ఏడుస్తూ ఉన్నా కనికరం లేకుండా కొడుతున్నాడు.
నా కాళ్లు అతడే విరగ్గొట్టాడు. అని జవాబిచ్చింది ఎద్దు. అతను కలిపురుషుడని పరీక్షిత్ రాజుకు తెలిసింది.
దాంతో పరీక్షిత్ మహారాజు కలికి శిక్ష విధిస్తాడు. అప్పుడు కలి.. నన్ను ఎందుకిలా చిత్ర హింసలకు గురి చేస్తున్నావు? అని ప్రశ్నిస్తాడు. ఇది కలియుగం కాబట్టి నేను ఖచ్చితంగా భూమిపైకి రావాల్సిందే అంటాడు.
ఇది వదిలి నేనెక్కడుండాలి?
నేను ఎక్కడ ఉంటె నువ్వు అక్కడికి వచ్చి చంపుతానంటే ఎలా?
నేను ఎక్కడుండాలో చెప్తే అక్కడ మాత్రమే ఉంటా నన్నాడు కలి.
జూదశాల, మద్యపానం, వ్యభిచారం, జీవహింస జరిగే చోటు అనే నాలుగు స్థానాలను ఇస్తా నన్నాడు పరీక్షిత్తు.
తన పాలనలో ఉన్న ప్రజలు ఈ నాలుగు చోట్లకి వెళ్లరనే గట్టి నమ్మకంతో అలా అనుగ్ర హించా డాయన.
పరీక్షిత్ మహారాజు నాలుగు స్థానాలను మాత్రమే ఇచ్చినప్పటికీ జూదశాల నుంచి అసత్యం, మద్యపానం నుంచి మదం, అహంకారం, వ్యభిచారం నుంచి కామము, హింస నుంచి కోపం, క్రౌర్యం.
ఇలా మరో నాలుగు స్థానాలను కూడా ఆక్రమించాడు కలి.
ఇవి కాకుండా మరో స్థానం ఇవ్వమని వేడుకున్నాడు కలి. సరేనని బంగారం ఉన్న చోటు కూడా నీదే నన్నాడు.
అయితే బంగారం నుంచి మాత్సర్యం పుడుతుంది. కాబట్టి ఆ స్థానాన్ని కూడా తనది చేసుకున్నాడు కలి పురుషుడు.
మొత్తానికి తొమ్మిది స్థానాల్లో కలి ఉంటాడు అని మనం చెప్పవచ్చు.

కలి ప్రభావంతో పరిక్షిత్తు మహారాజు పరిస్థితి:-
పరీక్షిత్ మహారాజు దరిదాపులకు కూడా రాలేని కలి, బంగారం స్థానాన్ని పొందగానే చెలరేగిపోయాడు. పరీక్షిత్ మహారాజు ఒంటినిండా బంగారం ఉండడంతో ఆయనలోకే ప్రవేశించ గలిగాడు.
ఆ ప్రభావంతో క్రూర,మృగాల బాధ తప్పించ డానికి మాత్రమే వేటాడే రాజు, హింసాత్మకుడై వెంటనే వేటకు వెళ్లాలని పించింది.
జీవహింస కూడా ఉండడంతో కలి ప్రభావం మరింత పెరిగింది.
అప్పుడే దాహంతో శమీక మహర్షి ఆశ్రమానికి వెళ్లడం, తపస్సులో నిమగ్నమై ఉన్న ఆయన మెడలో క్రోధంతో చనిపోయిన పామును వేసి ఎగతాళి చేయడం జరుగుతుంది.
శమీక మహర్షి కుమారుడైన శృంగి చేతిలో తక్షకుడి ద్వారా మరణిస్తావన్న శాపానికి కూడా గురవుతాడు.
ఇంటికి వెళ్లి కిరీటం, ఆభరణాలు తీసి పక్కన పెట్టగానే కలి ప్రభావం నశించి పశ్చాత్తాపం కలుగుతుంది.
అలా కలిని నియంత్రించ గలిగిన పరీక్షిత్తు కూడా తానే అతడి ప్రభావానికి లోనై చివరికి మరణాన్ని కొనితెచ్చు కుంటాడు.

కలి ప్రభావం – నల దమయంతుల కథ:-
నల-దమయంతుల – స్వయం వరం:-
దమయంతి స్వయంవరం ముగిసి, నలమహారాజును ఆమె వరించిన తరువాత అదే స్వయంవరానికి వచ్చిన అష్ట దిక్పాలకులు తిరిగి వెళ్లే టప్పుడు కలి పురుషుడు ఎదురవుతాడు.
దమయంతిని వివాహ మాడడానికి వెళ్తున్నా నంటాడు. ఇంకెక్కడి వివాహం?.. స్వయంవరం ముగిసింది. ఆమె నలుని వరించిందని చెబుతారు దిక్పాలకులు. ఇది తెలిసి కలిపురుషుడు నలమహారాజుపై క్రోధంతో వాళ్లెలా సుఖంగా ఉంటారో చూస్తానని ప్రతిన బూనుతాడు. కాని ధర్మబద్ధుడై, నిరంతరం దైవచింతన కలిగి, అరిషడ్వర్గాలను అదుపులో ఉంచుకునే నలమహారాజు దగ్గరికి కలి పురుషుడు వెళ్లలేకపోతాడు.కాని ఒకరోజు దురదృష్టవశాత్తు మూత్ర విసర్జన అనంతరం కాళ్లు సరిగా కడుక్కోక హడావుడిగా వెళ్లిన నలుడిలోకి ప్రవేశించ గలుగుతాడు కలి.
ఇక అంతటి నలమహారాజు కూడా ధర్మం తప్పుతాడు.మనసుపై నియంత్రణ కోల్పోతాడు. దాయాదులతో జూదమాడి రాజ్యం, సర్వ సంపదలు అన్నీ కోల్పోతాడు.
భార్య దమయంతి ఎంత చెప్పినా వినిపించుకోడు. వెంటనే ఆమె సారథిని పిల్చి, పిల్లలిద్దరినీ పుట్టింటికి పంపించి వేస్తుంది. రాజ్యం దాయాదులకు అప్పగించి, నలదమయంతు లిద్దరూ అరణ్యాలకు బయల్దేరుతారు.
ఆకలి దప్పులతో బాధపడుతుంటారు. ఓరోజు పక్షులు తను కట్టుకున్న పంచెను కూడా లాక్కెళ్లి పోతాయి.
తను లేకుంటే భార్య సుఖపడుతుందని భావించిన నలుడు ఆమెను అక్కడే వదిలి వెళ్లిపోతాడు.
ఒకసారి నల మహారాజా! రక్షించు! అనే అరుపులు వినిపిస్తాయి. అరణ్యం కాలిపోతుంటే మంటల మధ్యలో కర్కోటకుడనే మహాసర్పం అరుస్తూ కనిపిస్తుంది. దాన్ని కాపాడి నదిలో వేయబోతుంటే కాటేస్తుంది. దాంతో అందమైన నల మహారాజు మరుగుజ్జు అయిన కురూపిగా మారిపోతాడు.
నీకు సాయం చేసిన నన్నే కాటేశావెందుకంటాడు నలుడు. నీ అసలు రూపం నీ ప్రతిష్ఠను దెబ్బతీస్తుంది. నీకు మాత్రమే తెలిసిన అశ్వహృదయం విద్యతో రుతుపర్ణ మహారాజును ఆశ్రయించు.
నీకు అవసరం అయినప్పుడు నన్ను తల్చుకుంటే ఓ దివ్య వస్త్రం వస్తుంది. దాని సహాయంతో నీ స్వస్వరూపాన్ని పొందగలవని చెబుతాడు కర్కోటకుడు.
నలుడు బాహుకుడనే పేరుతో రుతుపర్ణ మహారాజు దగ్గర వంటవాడిగా చేరుతాడు. అశ్వ హృదయ విద్య ద్వారా మొండి గుర్రాలను లొంగదీసుకోగలుగుతాడు.
ఒక్క రాత్రిలోనే ఒక ఊరి నుంచి వేరే ఊరికి వెళ్లగలడు.అరణ్యంలో ఉన్న దమయంతి భర్త కోసం వెదుకుతూ ఇద్దరు బ్రాహ్మణుల సాయంతో సుబాహుపురం చేరుతుంది. అక్కడ రాజమాత చూసి, తన దగ్గర పెట్టుకుంటుంది.నల దమయంతుల జాడ తెలుసు కోవడానికి దమయంతి తండ్రి వేగులను పంపుతాడు. అలా సుబాహుపురం చేరిన వేగు ద్వారా రాజమాతకు ఆమె దమయంతి అని తెలుస్తుంది. తన పెద్దమ్మ దగ్గరే చేరానని అర్థమైన దమయంతి తన తండ్రి దగ్గరకు వెళ్లిపోతుంది.
ఆమె కొంతమంది బ్రాహ్మణులను పిల్చి అన్ని రాజ్యాలకు పంపిస్తుంది.
అర్ధరాత్రి సమయంలో అరణ్యంలో పతివ్రత అయిన తన అమాయకపు భార్యను వదిలి వెళ్లడం ధర్మమేనా? అలాంటి పురుషుడున్నాడా? అనే ప్రశ్న అన్ని సభల్లోనూ అడగమంటుంది.
అలా రుతుపర్ణుడి రాజ్యానికి చేరిన బ్రాహ్మణుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పతివ్రత అయిన భార్య తన భర్త పరిస్థితి తెలుసుకోకుండా నిందించవచ్చా? అని అడుగుతాడు బాహుకుడి రూపంలో ఉన్న నలుడు.
ఇది తెలిసిన దమయంతి ఆయనే నలమహారాజని నమ్ముతుంది. అందుకే దమయంతి ద్వితీయ స్వయం వర ఆహ్వాన మంటూ రుతుపర్ణుడికి మాత్రమే పంపించ మని తండ్రిని కోరుతుంది. రుతుపర్ణుడు బాహుకుడిని వెంటబెట్టుకుని స్వయంవరానికి వెళ్తాడు. దారిలో నీకు అశ్వహృదయం విద్య తెలిస్తే నాక్కూడా మరో విద్య తెలుసునని, దాని ద్వారా చెట్టుకు ఎన్ని కొమ్మలు రెమ్మలు ఉన్నాయో సరిగ్గా లెక్క చెప్పవచ్చు నంటాడు రుతుపర్ణుడు. ఆ విద్యను నలుడికి ఉపదేశిస్తాడు.
దాని మహిమ వల్ల కలిపురుషుడు, చెడులక్షణాలూ ఉండజాలవు. కాబట్టి నలుడి నుంచి కలి పురుషుడు బయటకు వస్తాడు. తనను సంహరించ ప్రయత్నించిన నలుడిని క్షమించమని నలుడి కాళ్లపై పడతాడు.
కర్కోటకుడు కాటు వేసినప్పటి నుండే నేను మంటలతో చచ్చిపోతున్నాను. నేనింక నీ జోలికి ఎప్పుడూ రాను. ఆ తాండ్ర చెట్టు దగ్గరే పడిఉంటానని వేడుకుంటాడు.
అప్పుడు మహారాజు స్వయంవరం చేరుకుంటాడు. హడావుడేమీ లేకపోవడంతో ఆశ్చర్యానికి లోనవుతారు.అప్పుడు దమయంతి సభలోకి వచ్చి అదే ప్రశ్న మళ్లీ వేస్తుంది.అది ధర్మం కాదు గానీ కలి ప్రభావం వల్ల అలా చేశానని చెబుతాడు నలుడు.
ద్వితీయ స్వయంవరం కూడా నిన్ను చేరడానికేనని చెబుతుంది దమయంతి.
నలుడు కర్కోటకుడిని తలచుకుంటాడు. దివ్యవస్త్రం వస్తుంది. అది ధరించగానే విషప్రభావం నశించి, కురూపి రూపం పోయి, నలమహారాజులా మారిపోతాడు.అప్పుడు కలి వచ్చి, రాబోయే కాలంలో నీ చరిత్రను పద్యరూపంలోనో, గద్యరూపంలోనో, మరే రూపేణా విన్నా, పాడినా, తలచినా వారి జోలికి వెళ్లనని వరమిస్తాడు
కలి నుండి మనం ఎలా తప్పించు కోగలం:-
ఈ కాలం పేరే కలి కాలం కలి ఎలాగైనా వెంటాడి తీరుతాడు. ఈ యుగం లో ధర్మం అడుగంటి ఉంటుంది. కావున ఎవరికైనా చిన్న సాయం చేసినా, కలి నుండి మనం కొంత తప్పించు కుంటాం
మనస్ఫూర్తిగా రోజు ఒక్క సారైనా దైవ స్మరణ చేసిన చాలు కలి నుండి మనం కొంత తప్పించు కుంటాం .
దాన ధర్మం లు చేయడం,
పెద్దల శ్రాద్ధ కర్మలు మర్చి పోకుండా చేయడం, నోరు లేని జీవాలను ఆదరించడం
కాశీకి వెళ్లినట్టు మనసులో తలచుకొన్న చాలు. కలి నుండి మనం కొంత తప్పించు కుంటాం.
దైవ సంబంధమైన చర్చల్లో భజనలలో, పాల్గొన్నాచాలు. కలి పురుషునికి దూరంగా ఉండవచ్చు

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks