Menu Close

కూటమి మ్యానిఫెస్టో – TDP, BJP & JanaSena Manifesto 2024

కూటమి మ్యానిఫెస్టో – TDP, BJP & JanaSena Manifesto 2024

TDP, BJP & JanaSena Manifesto 2024: ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడిగా ఏర్పాటు చేసుకున్న ఎన్డీయే కూటమి తమ ఎన్నికల మ్యానిఫెస్టోను ఇవాళ విడుదల చేసింది. ఇందులో భారీ హామీలు ఇచ్చారు. ఇప్పటికే టీడీపీ మినీ మ్యానిఫెస్టో రూపంలో ఇచ్చిన గ్యారంటీలతో పాటు జనసేన, బీజేపీ ప్రతిపాదించిన పలు హామీలకూ ఇందులో చోటు కల్పించారు. మహిళలు, రైతులు, నిరుద్యోగులు ఇలా అన్ని రంగాల వారినీ సంతృప్తి పర్చేలా ఇందులో పలు హామీలున్నాయి.

TDP, BJP, Janasena Manifesto 2024

సూపర్ సిక్స్ 1.0

  • యువతకు 20 లక్షల ఉద్యోగాలు / నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి
  • స్కూలుకి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000
  • ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు ఆర్థిక సాయం
  • ప్రతి మహిళకి నెలకు రూ.1500 (19 సం॥ నుంచి 59 సం॥ వరకు)
  • ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు
  • మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

సూపర్ సిక్స్ 2.0 / షణ్ముఖ వ్యూహం

  • ఇంటింటికీ రక్షిత తాగునీరు : ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్
  • పూర్ టు రిచ్ : పేదలను సంపన్నులను చేసే దిశగా పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్, పార్టనర్షిప్ (పి4) పథకాలు
  • రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్ చేపట్టి తద్వారా ప్రజల నైపుణ్యత స్థాయిని పెంచుతాం
  • సౌభాగ్యపథం : చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు, అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో గరిష్టంగా రూ. 10 లక్షల వరకు సబ్సిడీ
  • రాష్ట్ర స్థూల ఉత్పత్తిని త్వరితగతిన పెంచడానికి పటిష్టమైన చర్యలు • ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధి

యువత సంక్షేమం

  • మెగా డియస్సీ, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్
  • ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి, ఉద్యోగ కల్పనకు ప్రత్యేక ఎంప్లాయ్ మెంట్ జోన్ ఏర్పాటు
  • అత్యధిక ఉద్యోగ కల్పన చేసే ఎంఎస్ఎంఈ సెక్టార్కు ప్రోత్సాహకాలు
  • మూతపడిన ప్రతి నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని పునః ప్రారంభం- విస్తరణ
  • పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగాలు కల్పిస్తాం
  • క్రీడలు : ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాలు అభివృద్ధిపరిచి రాష్ట్ర యువతను అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతాం. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు రాష్ట్రాన్ని వేదికగా మారుస్తాం
  • డిజిటల్ లైబ్రరీలు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరీక్షలకు ప్రిపేర్ కావడం కోసం డిజిటల్ లైబ్రరీల స్థాపన
  • NDA ప్రభుత్వం తెచ్చిన 10 శాతం EWS రిజర్వేషన్లను అమలు చేస్తాం. ప్రతి 5 ఏళ్లకు ఒక సారి ఆర్థిక సర్వే చేసి రిజర్వేషన్లు అమలు చేస్తాం.

బీసీ డిక్లరేషన్

  • బీసీలకు 50 సంవత్సరాలకే నెలకు రూ.4 వేల పెన్షన్ ఇస్తాం.
  • బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం
  • బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ. లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తాం.

బీసీలకు రాజకీయ ప్రాధాన్యత

  • స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్
  • చట్ట సభల్లో బీసీలకు 33శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం.
  • తక్కువ జనాభాతో, ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు నామినేషన్ల ద్వారా రాజకీయ భాగస్వామ్యం
  • బీసీల ఆర్ధికాభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహకాలు పునరుద్ధరిస్తాం

శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తాం

  • దామాషా ప్రకారం కార్పొరేషన్లకు నిధులు
  • స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ. 10 వేల కోట్లు వ్యయం చేస్తాం.
  • రూ.5000 కోట్లతో ‘ఆదరణ’ పథకం పునరుద్ధరిస్తాం.

యాదవ/కురుబ: అత్యాధునిక ప్రమాణాలతో గొర్రెల పెంపకం యూనిట్ల స్థాపనకు రాయితీలు. గొర్రెలు, మేకల పెంపకం యూనిట్లకు బీమా సౌకర్యం

చేనేత ఉత్పత్తులపై జీయస్ట రీయంబర్స్ చేస్తాం: పవర్లూమ్లకు 500 యూనిట్లు, హ్యాండ్లూమ్లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్

నాయీ బ్రాహ్మణులు: దేవాలయాల్లో పనిచేసే నాయీబ్రాహ్మణులకు రూ.25 వేలు గౌరవ వేతనం. షాపులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్

వడ్డెర: క్వారీల్లో 15% రిజర్వేషన్… రాయల్టీ, సీనరీ ఛార్జీల్లో మినహాయింపు

రజక : దోబీఘాట్ల నిర్మాణాలకు ప్రోత్సాహం, విద్యుత్ ఛార్జీల రాయితీ

మత్స్యకారులు

  • సముద్రంలో వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ.20,000 ఆర్థిక సాయం. జీవో 217 రద్దు చేస్తాం. బోట్ల మరమ్మత్తులు, ఆధునిక కమ్యూనికేషన్ కు ఆర్థిక సాయం
  • స్వర్ణకారుల అభివృద్ధికి కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు
  • తోట చంద్రయ్య, అమర్నాథ్ గౌడ్, జల్లయ్య యాదవ్, పాల సుబ్బారావు లాంటి బీసీలను హత్య చేసిన వైకాపాగూండాలకు శిక్ష పడే విధంగా చర్యలు.
  • గీత కార్మికులు : మద్యం షాపుల్లో 10% కేటాయింపు

మహిళా సంక్షేమం

  • స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ.3 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు పెంపు
  • ప్రత్యేక పథకం ద్వారా పి4 మోడల్లో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి చర్యలు
  • అంగన్వాడీ కార్యకర్తలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తాం. ఆశా వర్కర్లకు కనీస వేతనం పెంపు దిశగా చర్యలు
  • ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి కల్పన
  • విద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ పథకం ద్వారా రుణాలు
  • పండుగ కానుకలు, పెళ్లి కానుకలు పునరుద్దరిస్తాం.

ఉద్యోగస్తులు, పెన్షనర్స్

  • గత అయిదేళ్ల పాలనలో ప్రధాన వ్యవస్థలన్నీ విధ్వంసమయ్యాయి. ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు, అవమానాలకు గురయ్యారు. వారి గౌరవాన్ని పునఃప్రతిష్టింప చేసి పూర్తి అనుకూల వాతావరణంలో వారు పనిచేసేలా తగు చర్యలు చేపడతాం.
  • సీపీయస్/జీపీయస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తాం
  • ఉద్యోగులకు మెరుగైన పీఆర్సి అమలు చేస్తాం. అలవెన్స్ పేమెంట్స్ పైన కూడా పునఃపరిశీలన చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం
  • రాష్ట్రంలోని ఉద్యోగులకు, పెన్షన్స్కు ప్రతి నెలా 1వ తారీఖున జీతాలు, పెన్షన్లు చెల్లిస్తాం. వీరికి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించే ఏర్పాటు చేయబడుతుంది. పెన్షనర్స్ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు.
  • తక్కువ జీతాలు పొందే అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు, కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపు
  • వాలంటీర్ల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ. 10 వేలకు పెంపు

పాడి రైతులు

  • పశువుల కొనుగోళ్లు, దాణా, మందుల కొనుగోళ్లపై సబ్సిడీలు – ఇన్సూరెన్స్ సౌకర్యం – గోకులాల ఏర్పాటు – మేత కోసం బంజరు భూముల కేటాయింపు
  • గోపాలమిత్రల పునర్నియామకం దిశగా చర్యలు

కాపు సంక్షేమం

  • ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు అదనంగా కాపుల సంక్షేమం కోసం కనీసంగా రానున్న అయిదేళ్లలో రూ.15 వేల కోట్లు నిధులు కేటాయించి కాపుల సాధికారిత, అభివృద్ధి కోసం చర్యలు చేపడతాం.
  • కాపు యువత, మహిళల నైపుణ్యాభివృద్ధికి, స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇస్తాం.
  • కాపు భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తాం.

ఆర్యవైశ్య సంక్షేమం

  • ఆర్యవైశ్య కార్పొరేషనక్కు తగు మేరకు నిధులు కేటాయింపు
  • చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాల సౌలభ్యం
  • స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపార నిర్వహణకు పటిష్ట చర్యలు
  • కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారిక కార్యక్రమంగా చేపడతాం

క్షత్రియ సంక్షేమం

  • భోగాపురం ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టుగా నామకరణం
  • ప్రజా రాజధాని అమరావతిలో అల్లూరి సీతారామరాజు స్మృతివనం నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కేటాయింపు

అగ్రవర్ణ పేదల సంక్షేమం: కమ్మ, రెడ్డి, వెలమ మరియు ఇతర అగ్రకుల కార్పొరేషన్లకు తగు విధంగా నిధులు కేటాయించి వారి సాధికారిత, అభివృద్ధికి చర్యలు చేపడతాం.

ఎక్స్ సర్విస్ మాన్ సంక్షేమానికి చొరవ: ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎక్సెసర్వీస్మెన్ సంక్షేమానికి కృషిచేస్తాం. వారి సమస్యలను పరిష్కరిస్తాం.

సామాజిక భద్రత పింఛన్లు పెంపు

  • రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంపు – ఏప్రిల్ 2024 నుంచి అమలు దివ్యాంగుల పింఛన్ రూ. 6,000 పెంచుతాం.
  • పూర్తిస్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు రూ.15 వేలు పింఛన్
  • కిడ్నీ, తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేలు పింఛన్

పేదలందరికీ నాణ్యమైన ఇళ్ళు

  • గృహ నిర్మాణానికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం మంజూరు చేస్తాం
  • ఇప్పటివరకు మంజూరై పట్టాలు పొందిన వారికి ప్రభుత్వం నుంచి
  • పక్కా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం

ఎస్సీ, ఎస్టీ సంక్షేమం

  • జిల్లావారీగా వర్గీకరణ అమలుచేస్తాం
  • ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లకే పింఛన్ మంజూరు
  • సబ్ ప్లాన్ నిధులు వారి అభివృద్ధికే ఖర్చు చేస్తాం.
  • ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకం. జీవో 3 పునరుద్ధరణ
  • ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల పునరుద్ధరణ
  • డా॥ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, మంత్రూబాయ్, డా॥ అచ్చెన్న తదితరుల హత్యలకు కారకులను కోర్టుల్లో శిక్షపడే విధంగా చర్యలు
  • ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేస్తాం

ముస్లిం మైనారిటీల సంక్షేమం

  • ముస్లిం మైనారిటీలకు 50 యేళ్ళకే పెన్షన్
  • మైనారిటీలకు ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, ఖబరిస్తాన్లకు స్థలాలు కేటాయింపు; విజయవాడ సమీపంలో హజ్ హౌస్
    నిర్మాణం
  • నూర్బాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా రూ.100 కోట్లు కేటాయింపు – మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు
  • ఇమామ్, మౌజన్ లకు ప్రతినెలా రూ.10 వేలు మరియు రూ.5 వేలు గౌరవ వేతనం;
  • అర్హత ఉన్న ఇమామ్లను ప్రభుత్వ ఖాజీలుగా నియమించుట
  • మసీదుల నిర్వహణకు ప్రతి నెలా రూ.5 వేలు ఆర్థిక సాయం – హజ్ యాత్రకు వెళ్లే ఒక్కో ముస్లింకు రూ.1 లక్ష సాయం.

క్రిష్టియన్ల సంక్షేమం

  • క్రిష్టియన్ మిషనరీస్ ప్రాపర్టీస్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చర్చిల నిర్మాణం, పునరుద్ధరణకు ఆర్థిక సాయం
  • స్మశాన వాటికలకు స్థల కేటాయింపు
  • జెరూసలెం యాత్రికులకు సాయం

వ్యవసాయం

  • 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా
  • రాయితీతో సోలార్ పంప్ సెట్లు – మిగిలిన విద్యుత్ ప్రభుత్వం కొనుగోలు
  • సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు
  • ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు
  • కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేసి అన్ని సంక్షేమ పథకాలు అందించుట – పంటల బీమా వర్తింపు
  • రైతు కూలీలకు కార్పొరేషన్ స్థాపించి రాయితీలు / సంక్షేమ పథకాల అమలు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 1000 ఎకరాలలో సేంద్రీయ వ్యవసాయం (ZBNF) చేపట్టి వారికి ఆర్థిక, సాగు, మార్కెటింగ్ అంశాల్లో తోడ్పాటు
  • ప్రభుత్వ రంగంలో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజి యూనిట్ల ఆధునీకరణ, నూతన యూనిట్ల ఏర్పాటు
  • దళారుల దోపిడీని అరికట్టడానికి ఏపీయంసీ యాక్ట్ పటిష్టంగా అమలు డ్రిప్ ఇరిగేషన్కు 90% సబ్సిడీ
  • రాష్ట్రంలో సెరికల్చర్ను ప్రోత్సహించి రైతులను ఆదుకుంటాం. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తాం

సాగునీటి రంగం

  • పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి
  • గాలేరు-నగరి, హంద్రీ-నీవా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తోటపల్లి రిజర్వాయర్, వంశధార-నాగావళి నదుల అనుసంధానం వంటి ప్రాజెక్టుల శీఘ్రతర నిర్మాణానికి చర్యలు
  • రాష్ట్రంలోని నదుల అనుసంధానం-ప్రతి ఎకరాకు నీరు రాయలసీమ, ఉత్తరాంధ్ర పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి

కార్మికులు

  • రవాణా రంగం : డ్రైవర్ సాధికార సంస్థ ఏర్పాటు చేసి అన్ని వర్గాల డ్రైవర్లకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, విద్యా రుణాలు వంటి సంక్షేమ కార్యక్రమాల అమలు – డ్రైవర్లను ఓనర్లు చేసే లక్ష్యంతో వాహన కొనుగోళ్లకు రూ.4 లక్షల వరకు పొందే రుణాలపై 5% పైబడిన వడ్డీ సబ్సిడీ
  • బ్యాడ్జ్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కు, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ, టిప్పర్ డ్రైవర్కు ఏటా రూ.15 వేలు ఆర్థిక సాయం
  • జీవో 21 రద్దు చేసి ఫైన్ల భారం తగ్గింపు
  • వాహనాలపై పెంచిన గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు
  • అసంఘటిత రంగ కార్మికులు: చంద్రన్న బీమా పునరుద్ధరణ అసంఘటిత కార్మికులందరికీ వర్తింపు
  • భవన నిర్మాణ బోర్డు పునరుద్ధరణ
  • ముఠా కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు

చంద్రన్న బీమా పథకం: సహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 10 లక్షలు బీమా సౌకర్యం

  • పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రిస్తాం
  • మద్యం ధరల నియంత్రణ, విషపూరిత మద్యం బ్రాండ్లు రద్దు
  • అన్న క్యాంటీన్ల ఏర్పాటు / డొక్కా సీతమ్మ స్ఫూర్తితో పేదల ఆకలి తీరుస్తాం
  • రేషన్ పంపిణీ విధానాన్ని సమీక్షించి పౌరసరఫరాల వ్యవస్థను పటిష్టం చేస్తాం.

ఫీజు రీయింబర్స్మెంట్

  • ఎయిడెడ్ కాలేజీలు, ప్రయివేట్ పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పునరుద్ధరిస్తాం
  • కాలేజీలకే రుసుము చెల్లించి సర్టిఫికేట్లు విద్యార్థులకు చిక్కులు లేకుండా చేస్తాం

ఉచిత ఇసుక విధానం అమలు చేస్తాం: సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన ఇసుక విధానం.

విద్య

  • కేజీ టు పీజీ సిలబస్ ని రివ్యూ చేస్తాం
  • రాష్ట్రంలో అనేక స్కూళ్లు మూతపడటానికి కారణమైన జీవో 117 రద్దు, మూతపడిన పాఠశాలల పునఃప్రారంభం
  • డా॥ అంబేద్కర్ విదేశీ విద్య పథకం పునరుద్ధరణ

గంజాయి, డ్రగ్స్ మాదకద్రవ్యాల నిర్మూలనకు 100 రోజుల్లో కఠిన చర్యలు చేపడతాం. అవసరమైతే మరింత కఠిన చట్టాలు తీసుకొస్తాం.

వైద్యం, ఆరోగ్యం

  • దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షలు ఆరోగ్య బీమా
  • ప్రతి పౌరునికి డిజిటల్ హెల్త్ కార్డులు
  • అన్ని మండల కేంద్రాలలో జన ఔషధి కేంద్రాల ఏర్పాటు
  • బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యూనికబుల్ వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందులు పంపిణీ

విద్యుత్ ఛార్జీలు నియంత్రిస్తాం: ఇంటి పైకప్పుపై కేంద్ర ప్రభుత్వ సోలార్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి పథకం అనుసంధానం ద్వారా విద్యుత్ బిల్లుల భారం తగ్గిస్తాం – అదనపు విద్యుత్ను ప్రజల నుంచి కొనుగోలు

చెత్త పన్ను రద్దు ఇంటి పన్నుల సమీక్ష

ఆక్వా: అవసరమున్న జిల్లాల్లో 5 వేల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన కోల్డ్ స్టోరేజీలు. అన్ని జోన్లలో ఉన్న వారికి విద్యుత్ యూనిట్కు రూ.1.50కే సరఫరా చేస్తాం. ట్రాన్స్ఫార్మర్ల ధరలు తగ్గిస్తాం – ఏవియేటర్లు సబ్సిడీపై అందిస్తాం.

సమగ్రాభివృద్ధి

  • ఉజ్వల భవిష్యత్ పట్ల ఆశావహులు ముఖ్యంగా పేదల ఆశలు నెరవేరడానికి తగు అవకాశాలు కల్పించే శీఘ్రతర సమగ్ర ఆర్థిక అభివృద్ధికి పటిష్టమైన విధానాలను అమలుచేస్తాం. తద్వారా సంపద సృష్టితో సంక్షేమ పథకాల విస్తృత అమలును పటిష్టం చేస్తాం.
  • విజన్ 2047 ప్రణాళిక ద్వారా వికసిత భారత్ నిర్మాణానికి చేపడుతున్న పలు చర్యలను పూర్తి స్థాయిలో రాష్ట్రంలో కూడా అమలు చేసే విధంగా చర్యలు చేపడతాం

మౌలిక వసతుల కల్పన

  • గ్రామాల నుంచి మండల కేంద్రాలకు, జిల్లా కేంద్రాలకు రోడ్ల నిర్మాణం
  • సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేస్తాం
  • పోర్టులు, ఎయిర్పోర్టులు, రైల్వే ప్రాజెక్టులు త్వరితగతిన నిర్మిస్తాం
  • వర్క్ ఫ్రమ్ హెూమ్ కొరకు ప్రతి మండల, జిల్లా కేంద్రాలలో వర్క్ స్టేషన్ల ఏర్పాటు
  • ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు సరఫరా

ప్రజా రాజధానిగా అమరావతి పునర్నిర్మాణ: నవ్యాంధ్ర ప్రగతికి దోహదం చేసే రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి పటిష్టమైన చర్యలు చేపట్టి ఆర్థిక ప్రగతికి చేయూత కల్పిస్తాం

పారిశ్రామికీకరణ, పెట్టుబడులు

  • గత అయిదేళ్లుగా విధ్వంసానికి గురైన బ్రాండ్ ఏపీని పునఃప్రతిష్టించి, భారీ స్థాయిలో దేశ విదేశీ పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమల ఏర్పాటు ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతోపాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు పెద్ద ఎత్తున ఊతమిస్తాం. కొత్త ఇండస్ట్రియల్ పాలసీ కింద పూర్తి స్థాయిలో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ వంటి ఆధునిక, సాంకేతిక విజ్ఞానం వినియోగం ద్వారా తగు ప్రోత్సాహం

పర్యాటకం: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో వైల్డ్ లైఫ్, అడ్వెంచర్, హెరిటేజ్, ఈకో, టెంపుల్ మొదలగు టూరిజం సర్క్యూట్ల ఏర్పాటు. ఉపాధి కల్పనకు ప్రోత్సాహం

ఫుడ్ ప్రాసెసింగ్: వ్యవసాయ ఉత్పత్తుల ఆధారిత పరిశ్రమల స్థాపనకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలిచ్చి రైతుల ఆదాయం పెంచడంతోపాటు స్వయం ఉపాధి, ఉపాధి కల్పనకు ప్రోత్సాహం.

దేవాలయాలు, బ్రాహ్మణుల సంక్షేమం

  • హిందూ దేవాలయాలు, సత్రాల ఆస్తుల పరిరక్షణకు హిందూ ఎండోమెంట్ బోర్డు ఏర్పాటు
  • ప్రైవేటు దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు మినిమమ్ వేతనం ఉండేలా చేస్తాం
  • వార్షిక ఆదాయం రూ.50 వేలకు పైన ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు కనీస వేతనం రూ.15 వేలకు పెంపు – వార్షిక ఆదాయం రూ.50 వేలకు తక్కువ ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ధూప, దీప, నైవేద్యం కింద ఇచ్చే మొత్తాన్ని నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంపు
  • వైదిక, ఆగమశాస్త్ర సంబంధ విషయాల్లో ఆయా ఆలయాలకు పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి
  • తిరుపతి ఒంటిమిట్ట వంటి పుణ్య క్షేత్రాల పవిత్రతకి మూలధారాలైన వేయి కాళ్ల మండపం వంటి చారిత్రక కట్టడాల పునరుద్ధరణ
  • దేవాలయాలకు పూర్తి రక్షణ- గత ప్రభుత్వ హయాంలో దేవాలయాలపై జరిగిన దాడులకు బాధ్యులైన వారికి శిక్షపడే విధంగా ప్రత్యేక కమిషన్ ఏర్పాటుచేసి శిక్ష పడేలా చేస్తాం
  • బ్రాహ్మణ కార్పొరేషన్, బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని బలోపేతం చేస్తాం
  • పురోహితులను, వంట బ్రాహ్మణులను కులవృత్తిగా గుర్తిస్తాం
  • తిరుపతితో సహా అన్ని దేవాలయాల్లో పూజారితోపాటు ఒక బ్రాహ్మణుడిని ట్రస్ట్ బోర్డు మెంబర్గా అపాయింట్ చేస్తాం
  • బ్రాహ్మణులు అపరకర్మ చేసుకోవడానికి ప్రతి నియోజకవర్గంలో ఒక భవనం కట్టించి ఇస్తాం
  • వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగులకు ‘యువగళం’ కింద రూ.3 వేల నిరుద్యోగభృతి

ఉత్తరాంధ్ర అభివృద్ధి

  • విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాం
  • వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ప్రధాన ప్రాంతాలను అనుసంధానం చేసి పారిశ్రామికీకరణకు బాటలు
  • విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తాం. అవసరం అయిన, అనువైన భూమిని వెంటనే కేటాయించి జోన్ ను సాకారం చేస్తాం.
  • విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షిస్తాం
  • ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, నాగావళి-వంశధార నదుల అనుసంధానం, తోటపల్లి రిజర్వాయర్ ఆధునీకరణ వంటి ప్రాజెక్టుల సత్వర నిర్మాణం
  • జీడిమామిడి, కొబ్బరి ధరల స్థిరీకరణ కోసం చర్యలు
  • కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం.

రాయలసీమ అభివృద్ధి

  • తాగునీరు, సాగునీరు, విద్య, వైద్య సదుపాయాల ఏర్పాటుకు ప్రాధాన్యత
  • హార్టీకల్చర్ హబ్ గా, విత్తన రాజధానిగా రాయలసీమ
  • కర్నూలులో తక్షణ హైకోర్టు బెంచ్ ఏర్పాటు
  • కియా, ఇసుజు లాంటి పరిశ్రమలు మరిన్ని తీసుకొచ్చి రాయలసీమను ఆటోమొబైల్ హబ్ గా తీర్చిదిద్దుతాం.
  • చెన్నై-బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడారు రాయలసీమలోని కీలక పట్టణాలకు అనుసంధానం చేస్తూ ఇండస్ట్రియల్ క్లస్టర్గా తీర్చిదిద్దుతాం
  • యువగళం యాత్రలో ప్రకటించిన ‘మిషన్ రాయలసీమ’ అమలుకు చర్యలు

పంచాయతీరాజ్ డిక్లరేషన్

  • ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులను నేరుగా పంచాయతీలకు అందిస్తాం
  • పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వవైభవం కల్పిస్తాం – స్థానిక పాలనకు ఊతమిస్తాం
  • పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా అభివృద్ధికి ఒక విజన్ ఏర్పాటు చేస్తాం
  • పంచాయతీరాజ్ ప్రాజెక్టు ప్రతిపాదనల కోసం బడ్జెట్లో 5% కేటాయిస్తాం. ఐదేళ్లలో 10% వరకు పెంచుతాం.
  • సర్పంచ్ నుండి జెడ్పీ ఛైర్మన్ల వరకు ప్రస్తుత గౌరవ వేతనాన్ని పెంచుతాం

జర్నలిస్టులు: అక్రిడేషన్ కలిగిన ప్రతి జర్నలిస్టుకు ఉచిత నివాస స్థలం

న్యాయవాదులు: న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉచిత న్యాయ సేవల అందుబాటుకు లీగల్ కియోస్క్లల స్థాపన, జూనియర్ న్యాయవాదులకు ప్రభుత్వ స్టయిఫండ్ నెలకు రూ.10 వేలు, జూనియర్ న్యాయవాదుల శిక్షణకు ప్రత్యేక ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు

అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి బాధితులకు అందేలా చర్యలు తీసుకుంటాం

గుడ్ గవర్నెన్స్

  • గత అయిదేళ్లుగా వివిధ వ్యవస్థలు విధ్వంసమైన నేపథ్యంలో వ్యవస్థలను పటిష్టపరిచి సుపరిపాలన అందిస్తాం.
  • 5 ఏళ్లలో క్షీణించిన శాంతి భద్రతలను పునరుద్దరిస్తాం. లా అండ్ ఆర్డర్ కాపాడేందుకు అత్యంత ఎక్కువ ప్రధాన్యం ఇస్తాం.

కూటమి నేతలకు వచ్చిన సూచనలు, వినతులు, యువగళంలో వచ్చిన రిప్రజంటేషన్స్, జనవాణి రూపంలో జనసేనకు వచ్చిన వినతులు మరియు ఆన్లైన్లో వచ్చిన సూచనలు అన్నీ క్రోడీకరించి ఈ ప్రజా మేనిఫెస్టో తయారుచేయడం జరిగింది. రాష్ట్ర ప్రజల నేటి అవసరాలను తీరుస్తూ రేపటి ఆకాంక్షలను సాకారం చేసే ఈ మేనిఫెస్టోను కూటమి ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తుంది.

Like and Share
+1
1
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading