Menu Close

ఏపీ సచివాలయంలో భారీ స్కామ్‌ : ప్రజా ప్రతినిధుల సిబ్బంది పాత్ర ..!!


ఏపీ సచివాలయంలో కొనసాగుతున్న భారీ స్కామ్ ను ఏసీబీ గుట్టు రట్టు చేసింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన నిధుల గోల్ మాల్ జరిగినట్లుగా విచారణలో గుర్తించారు. సచివాలయంలోనే పని చేసే కొందరు సిబ్బంది పేదల డేటా సేకరించి ముఖ్యమంత్రి సహాయ నిధులు పక్క దారి పట్టించారని నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. ఇందులో సచివాలయ సిబ్బందితో పాటుగా ప్రజా ప్రతినిధులు పీఏలు .. వారి అనుచరుల పాత్ర పైనా ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించి ఆరు నెలల క్రితమే సీఎంఆర్ఎఫ్ అధికారులు ఫిర్యాదు చేసారు.

దీంతో..రంగంలోకి దిగిన ఏసీబీ పూర్తి స్థాయిలో విచారణ చేసింది. నకిలీ బిల్లులను క్రియేట్ చేసి వాటికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరు చేస్తున్నట్లుగా తేల్చారు. ఈ వ్యవహారం లో దాదాపు 50 మంది వరకు ప్రమేయం ఉందని చెబుతున్నారు. ఈ ఏడాది మే నుంచి ఏసీబీ ఈ వ్యవహారం పైన విచారణ ప్రారంభించింది. ఇప్పటికే పలువురు అధికారులు..సిబ్బందిని విచారించారు. అయితే, మరి కొందరు విచారణకు పిలిచినా హాజరు కాలేదు. విడతల వారీగా ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. గతంలో నోటీసులు ఇచ్చినా హాజరు కాని వారికి ఇప్పుడు ఏసీబీ మరో సారి నోటీసులు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading