రాముడి ధర్మ పరాయణత్వం – Moral Stories from Ramayanam
రామ రావణ యుద్ధం ముగిసింది.
రావణుడు వధించ బడ్డాడు.
విభీషణుడు రావణుడి అంతిమ సంస్కారం
చేయడానికి నిరాకరిస్తాడు.
విభీషణుడు రావణడి గురించి ఇలా అన్నాడు ..
ధర్మవ్రతం వదిలినవాడు, క్రూరుడు, కఠినుడు, అసత్యవాది,
పరస్త్రీలను బలాత్కారించేవాడు అలాంటి రావణుడికి
నేను అంతిమ సంస్కారం చేయ లేను.
అతను దానికి అర్హుడు కూడా కాదు.
ఆ మాటలు విని రాముల వారు ఇలా అన్నారు..

“రెండు కళ్ళు చాలవు స్వామి వారి ఈ విగ్రహం చూసేందుకు“
శత్రుత్వాలు మరణం తో అంతమైపోయాయి.
మనం తలపెట్టిన కార్యం పూర్తయింది.
ఇతని దహన సంస్కారం యధావిధిగా చెయ్యాలి.
రావణుడు నీకేలాగా సోదరుడో
నాకు కూడా అతను సోదర సమానుడే.
తన భార్యను అపహరించి
తనను క్షోభకు గురి చేసిన రావణుడి మీద
అతనికి కోపం లేదు రావణుడికి అంతిమ సంస్కారాలు
సగౌరవంగా, సక్రమంగా నిర్వర్తించమని చెప్తున్నాడు.
ఔదార్యము గల మహానుభావులకు ఈ వసుధ అంతా
ఒకే కుటుంబం అన్న సుభాషితానికి రాముల వారి కంటే
గొప్ప ఉదాహరణ వుండదు.
రామాయణం నీకేంత అర్ధమైంది.
రామాయణం నిజంగానే జరిగింది అని చెప్పడానికి 7 అద్భుత సాక్ష్యాలు.