Menu Close

క్షీర సాగర మథనం నుండి పుట్టినవి ఏమిటి?

క్షీర సాగర మథనం నుండి పుట్టినవి ఏమిటి? వాటి విశేషాలు ?

హాలాహలం – గరళం (విషంతో కూడినది)  శివుడు స్వీకరించాడు.
సురభి కామధేనువు – తెల్లని ఆవు –      దేవమునులు తీసుకున్నారు
ఉచ్ఛైశ్రవము – ఎత్తైన తెల్లని గుఱ్ఱము –     బలి చక్రవర్తి తీసుకున్నాడు.

ఐరావతము – నాలుగు దంతాలు కలిగిన తెల్లని ఏనుగు – ఇంద్రుడు తీసుకున్నాడు.
కల్పవృక్షం – కోరికలు తీర్చే చెట్టు – ఇంద్రుడు తీసుకున్నాడు.
అప్సరసలు – దేవతా సుందరీమణులు – ఇంద్రుడు తీసుకున్నాడు.
సుధాకరుడు – చంద్రుడు – ఆకాశంలో ఆకాశంలో వర్తిస్తున్నాడు.

లక్ష్మీ దేవి – సకల సంపదల దేవత –     విష్ణువును వరించి వక్షస్థలమున ఉంది.
వారుణి – మధ్యమునకు అధిదేవత –      రాక్షసులు పుచ్చుకున్నారు
ధన్వంతరి – వైద్యానికి అధిదేవత –       దేవతలలో చేరాడు.
అమృతం – మరణంలేని మందు –       దేవతలు తీసుకున్నారు.

సాగరమథనంలో అవతారాలు: కూర్మావతారం, మోహినీ అవతారం.
సాగరమథనంలో పాలుపంచుకున్న అష్టకం (8): క్షీర సాగరం, శ్రీమహావిష్ణువు, దేవతలు, దానవులు, గరుత్మంతుడు, మందర పర్వతం, వాసుకి నాగేంద్రుడు, పరమశివుడు
   

Like and Share
+1
2
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading