Hyderabad: వినాయకుడి మండపాలు ఏర్పాటు చేసేవారు ఈ రూల్స్ తెలుసుకోండి
- గణేష్ మండపాలు ఏర్పాటు చేసేందుకు ఎంచుకున్న ప్రభుత్వ, ప్రయివేటు స్థల యజమానుల నుంచి నిరభ్యంతర ధ్రువపత్రం (NOC) తప్పనిసరిగా తీసుకోవాలి.
- వివాదాస్పద ప్రదేశాల్లో వినాయకుడి మండపాలు ఏర్పాటు చేసేందుకు అనుమతి ఉండదు.
- మండపాలకు అవసరమైన విద్యుత్తు ఏర్పాటుకు విద్యుత్తు శాఖ నుంచి అనుమతి ఉండాలి.
- సెల్లార్లు, కాంప్లెక్స్ల్లో విగ్రహాల ఊరేగింపులకు పోలీసుల అనుమతి కచ్చితంగా తీసుకోవాలి.
- సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రాత్రి 10 నుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు లౌడ్స్పీకర్ల నిషేధం ఉంటుంది.
- మండపాల వద్ద వాలంటీర్లు కార్డులు/బ్యాడ్జీలు ధరించాల్సి ఉంటుంది.
- మండపాల్లో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అగ్నిమాపక పరికరాలు ఉంచుకోవాలి.
- ఇక విగ్రహాలు ఊరేగింపుగా వెళ్లే మార్గం, సమయం వివరాలను ముందుగానే పోలీసులకు అందజేయాలి.
- మండపాల ఏర్పాటుకు సబంధించిన పత్రాలను జత చేసి రేపటి నుంచి (ఆగస్టు 27) సెప్టెంబర్ 6వ తేదీ లోపు పోలీసుల వెబ్సైట్లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది.
- అప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్, ఏసీపీ ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించి అనుమతి మంజూరు చేస్తారు.
- ఏవైనా సందేహాలుంటే సంబంధిత పోలీస్స్టేషన్, లేదా 8712665785 నెంబర్ను సంప్రదించాలి.
Ganesh Mandapam Rules
Like and Share
+1
1
+1
+1
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.